Revolutionary Changes in Tirumala Tirupati Devasthanams Services: తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన సమీక్షా సమావేశంలో శ్రీవారి సేవకుల పనితీరు, శిక్షణ మరియు వారి సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఒకవేళ సేవకుల నుండి ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే పరిష్కరించాలని అదనపు ఈవో ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ (Grievance Cell) ఏర్పాటు చేయాలని, ఒక ప్రత్యేక నంబర్ ద్వారా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు.

శ్రీవారి సేవకుల పనితీరులో పారదర్శకత పెంచేందుకు రేటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. సేవకుల సామర్థ్యం ఆధారంగా ఈ రేటింగ్ ఉంటుంది. అలాగే, సేవకులు భక్తులతో నడుచుకోవాల్సిన తీరుపై ముందస్తు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆధ్యాత్మిక వక్తలు మరియు సంగీత విద్వాంసుల ద్వారా వారిలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమలకు వచ్చే భక్తులు, సేవకులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అదనపు ఈవో సూచించారు. వీటితో పాటు రద్దీ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక విలువలను తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సమీక్షలోని ముఖ్యాంశాలు:

శ్రీవారి సేవ ముగిసిన తర్వాత సేవకుల అనుభవాలను, అభిప్రాయాలను సేకరించి లోపాలను సరిదిద్దడం.

రిటైర్డ్ సీనియర్ అధికారులను సేవకుల పర్యవేక్షకులుగా నియమించే అంశంపై కసరత్తు.

వివిధ విభాగాల సిబ్బంది సేవకులతో సమన్వయంతో మెలిగేలా స్పష్టమైన ఆదేశాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story