Sri Govindaraja Swamy Temple: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల (శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 21న భోగి తేరు, ఏప్రిల్ 22న సాత్తుమొర, ఏప్రిల్ 23న గంధపొడి ఉత్సవం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం భాష్యకార్ల వారికి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో, సాయంత్రం పెద్ద వీధి ఉత్సవం వైభవంగా చేపడుతారు. అదేవిధంగా ప్రతిరోజు దివ్యప్రబంధ సేవాకాలం, సాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.

Next Story