కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు మంగళవారం భక్తులను అనుగ్రహించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04 - 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 - 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం జరుగింది. మంగళవారం రాత్రి 07.00 గం.లకు సర్వభూపాల వాహనంపై స్వామి వారు తిరు వీధులలో సంచరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story