మల్లన్న చెంతకు పోటెత్తిన కన్నడ భక్తులు!

Srisailam Celebrates Ugadi: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి వేలాది మంది భక్తులు (కన్నడిగులు) తరలిరావడంతో నల్లమల కొండలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల సన్నిధిలో ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతి ఏటా ఆచారంగా వచ్చే కన్నడ భక్తులు ఈసారి కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వందల కిలోమీటర్ల దూరం నుండి పాదయాత్రగా వస్తున్నారు. చేతిలో నందులు, భుజాన కావిళ్లతో అటవీ మార్గాల గుండా ప్రయాణిస్తూ శ్రీశైలం చేరుకుంటున్నారు. కన్నడ భక్తులు చేసే వీరాచార విన్యాసాలు, డప్పు వాయిద్యాలు క్షేత్ర పరిసరాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు తాగునీరు, వసతి, వైద్య సౌకర్యాలను కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story