శ్రీవారి దర్శనానికి ముందుగా దర్శించవలసిన పవిత్ర క్షేత్రం

Devotional:శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం. తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు. అందువల్లనే వేంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.

వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు. వరాహ జయంతిని కూడా జరుపుతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story