Clean Your Plate After Meals: హిందూ సంప్రదాయంలో అన్నదానాన్ని అన్నయజ్ఞంగా పరిగణిస్తారు. మనం భుజించే ఆహారం పట్ల వినయం, భక్తి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భోజనం ముగిసిన తర్వాత పళ్ళెం విషయంలో ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం వల్ల అదృష్టం వరిస్తుందని గురూజీ పేర్కొన్నారు.

అన్నపూర్ణేశ్వరి దేవికి గౌరవం

భోజనం చేసిన తర్వాత పళ్ళెంలో ఒక్క మెతుకు కూడా వదలకుండా శుభ్రం చేయడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎన్నటికీ ఆహార కొరత ఏర్పడదు. అలాగే, మనకు ఆహారాన్ని వండి వడ్డించిన వారికి మనం ఇచ్చే అసలైన గౌరవం ఇదే.

ఆర్థిక శ్రేయస్సు - గ్రహాల అనుకూలత

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బియ్యం శుక్రుడు, చంద్రుని కారకత్వం కలిగి ఉంటుంది. భోజనం చేసిన పళ్ళెంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.

అలక్ష్మికి దూరం: భోజనం చేసిన తర్వాత పళ్ళెంను అలాగే వదిలేస్తే పేదరికం ప్రవేశిస్తుందని నమ్మకం.

తిన్న గిన్నెలను రాత్రంతా సింక్‌లో ఎంగిలిగా వదిలివేయకూడదు. ఇది ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుంది.

పళ్ళెంలో చేతులు కడగవద్దు

చాలామంది భోజనం ముగిశాక అదే పళ్ళెంలో చేతులు కడుగుతుంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా తప్పు. పళ్ళెం పక్కన పెట్టి వేరే చోట చేతులు కడుక్కోవడం వల్ల సానుకూలత పెరుగుతుంది. పళ్ళెంలో మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తబుట్టలో పడేసి, పళ్ళెంను వెంటనే కడగడం వల్ల క్రమశిక్షణ, వినయం మరియు సహనం పెంపొందుతాయి.

అతిథి దేవోభవ

మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని దైవ సమానంగా భావించాలి. వారు భోజనం చేశాక వారి చేతి నుండి పళ్ళెం తీసుకోకూడదు. ఇది వారికి మనం ఇచ్చే మర్యాద. అయితే, ఈ నియమాలు కేవలం ఇంటికి మాత్రమే వర్తిస్తాయని, హోటళ్లు లేదా వివాహ వేడుకలలో సిబ్బంది ఉంటారు కాబట్టి అక్కడ ఇవి వర్తించవని గురూజీ స్పష్టం చేశారు.

మనకు అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే పళ్ళెంలో వడ్డించుకోవాలి. ఆహారాన్ని వృథా చేయడం అంటే మన అదృష్టాన్ని పారద్రోలడమే. భోజనం తర్వాత పళ్ళెం శుభ్రం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, సంబంధాలు మెరుగుపడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story