పూరీ జగన్నాథ ఆలయానికి ఎందుకు వెళ్లకూడదు..?

Unmarried Couples: జగన్నాథ రథయాత్ర జూన్ 26 నుండి ప్రారంభమవుతుంది. పూరీలో ఈ తీర్థయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. జగన్నాథుని 10 రోజుల రథయాత్రలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం వల్ల 100 యాగాలు చేసినంత ఫలితం లభిస్తుందని మత విశ్వాసం.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. దీని ప్రకారం.. ఈ సంవత్సరం ఇది జూన్ 26, 2025న మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంలో ప్రయాణించి తన అత్త ఇంటి అయిన గుండిచా ఆలయానికి చేరుకుంటాడు. 11వ రోజు, జగన్నాథుడు తన అన్నయ్య, సోదరితో కలిసి తన ఆలయానికి తిరిగి వస్తాడు. దీని అర్థం జగన్నాథ యాత్ర జూలై 5న ముగుస్తుంది.

జగన్నాథ రథయాత్ర ఎంత ప్రసిద్ధి చెందినదో, ఈ జగన్నాథ ఆలయం కూడా అంతే మర్మమైనది. పూరీ ఆలయానికి సంబంధించి అనేక అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరూ వాటిని కనుగొనలేకపోయారు. జగన్నాథ ఆలయం యొక్క రహస్యాలలో ఒకటి ఏమిటంటే అవివాహిత జంటలు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధించబడింది. ఈ నియమానికి గల కారణాన్ని ఇక్కడ తెలుసుకోండి.

పెళ్లి కాని జంటలు పూరీ జగన్నాథ ఆలయాన్ని ఎందుకు సందర్శించకూడదు?

పెళ్లికాని జంటలను జగన్నాథ ఆలయంలోకి అనుమతించకూడదనే నియమం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఇది రాధ శాపానికి సంబంధించినది. ఒక పురాణం ప్రకారం.. ఒకసారి రాధ పూరి జగన్నాథ ఆలయానికి వచ్చి జగన్నాథ రూపంలో శ్రీకృష్ణుడిని చూడాలనే కోరికను వ్యక్తం చేసింది. రాధ పూరీ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, జగన్నాథ ఆలయ పూజారులు రాధ లోపలికి రాకుండా అడ్డుకున్నారు.

రాధను పూరీ ఆలయంలోకి ఎందుకు అనుమతించలేదని పూజారులను అడిగినప్పుడు.. పూజారులు ‘‘రాధా, నువ్వు శ్రీకృష్ణుని ప్రేమికురాలివి మాత్రమే..వివాహిత స్త్రీ కాదు అని అంటారు. దీంతో కోపంగా ఉన్న రాధ జగన్నాథ ఆలయాన్ని శపించింది. జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే పెళ్లికాని జంట జీవితంలో ప్రేమను కోల్పోతారని, ఎప్పటికీ ఒకటిగా ఉండరని శపించింది. అప్పటి నుంచి పెళ్లి కాని జంటలు పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడం నిషేధించబడిందని చెప్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story