ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో జాప్యం

ఏప్‌ సెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ఇప్పటి వరకూ విడుదల కాకపోవడంతో ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌ సీట్ భర్తీ ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ సారి త్వరగా మే 1వ తేదీన ఏప్‌ సెట్‌ ఫలితాలు విడుదల చేశారు. గతంలో సెట్‌ ఫలితాలు విడుదలైన వెనువెంటనే కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించేవారు. ఈ సంవత్సరం గతేడాది కన్నా ముందే సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి క్లాసులు కూడా త్వరగా ప్రారంభింస్తామని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆరు నెలల ముందే స్పష్టం చేసింది. అయితే సెట్‌ ఫలితాలు విడుదలై మరో వారంలో నెల కావస్తున్నా ఇప్పటి వరకూ కౌన్సిలింగ్‌ పై అధికారులు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. కౌన్సిలింగ్‌ ఆలస్యమయ్యే కొద్దీ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నెల రెండో వారంలో షెడ్యూల్‌ ఇస్తామని అధికారులు చెపుతున్నప్పటికీ విద్యార్థుల్లో ఆందోళన తగ్గక ఇతర రాష్ట్రాల్లో మేనేజ్మెంట్‌ కోటా సీట్లలో చేరిపోవడానికి సిద్దపడిపోతున్నారు. అయితే ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ లో జరుగుతున్న జాప్యానికి ఏఐసీటీఈ నే కారణమని తెలుస్తోంది. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు, బ్రాంచిలకు సంబంధించి ప్రతి కాలేజీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలాఖరు లోపు లేదా మే మొదటి వారంలో ఏఐసీటీఈ ఈ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తుంది. కానీ ఈ సారి తమతో సంప్రదించిన తరువాతే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు ఏఐసీటీఈకి లేఖలు రాశాయి. ఒక వేళ ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్శిటీలు కొత్తగా అనుమతించిన సీట్లకు, బ్రాంచిలకు అనుబంధ గుర్తింపును నిరాకరిస్తున్నాయి. దీంతో ఈ పరిణామం అనేక న్యాయ వివాదాలకు దారితీస్తున్నాయి. ఈగొవంతా ఎందుకనుకున్న ఏఐసీటీఈ సీట్ల కేటాయింపు, బ్రాంచీల మంజూరులో ఆచితరి అడుగులు వేస్తోంది. ఈ కారణంగానే అనుమతి ఇవ్వడానికి ఆలస్యమవుతోందని అధికారులు చెపుతున్నారు. ఏఐసీటీఈ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఈ నెల 13వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ వ్యవహారం పూర్తయితే కానీ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్‌ సీట్లపై స్పష్టత రాదు. ప్రస్తుతం తెలంగాణలో లక్షా 16వేల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత ఖరారు కాకపోవడమే కాకుండా ఫీజులు ఖరారు కాకపోవడం కూడా కౌన్సిలింగ్ జాప్యానికి మరో కారణం. ప్రతి మూడేళ్ళకు ఒక సారి ఇంజనీరింగ్‌ ఫీజులను నియంత్రణ కమిటీ సమీక్షిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉండగా ఆ ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే ప్రైవేటు కాలేజీలు సమర్పించిన తమ మూడు సంవత్సరాల వార్షిక నివేదికలు తప్పుల తడకగా ఉన్నాఅందువల్ల ఫీజుల పెంపు వ్యవహారం ఎఫ్‌ఆర్‌ సీ ప్రభుత్వానికే వదిలేసింది. కౌన్సింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలంటే ఫీజుల వ్యవహారం కూడా తేలాల్సి ఉంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story