దేశ వ్యాప్తంగా జూన్ 15న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) 2025 పరీక్షను రెండు షిఫ్టులకు బదులుగా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఒకే షిఫ్టులో పరీక్షను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని, పూర్తి పారదర్శకత ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా, నీట్ పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించే నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, ఎన్‌వీ అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది.మరోవైపు నీట్ పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించడం 'ఏకపక్షపాతాన్ని' సృష్టిస్తుందని ధర్మాసనం పేర్కొంది. 'ఏ రెండు ప్రశ్నపత్రాలు ఒకే స్థాయిలో కష్టంగా లేదా సులభంగా ఉంటాయని ఎప్పుడూ చెప్పలేం' అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది

Politent News Web 1

Politent News Web 1

Next Story