People with Diabetes Eat Mangoes: మామిడి పండును ఫలరాజం అంటారు. దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న భయంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉంటుంటారు. అయితే సరైన పద్ధతిలో తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారు కూడా మామిడి పండును ఆస్వాదించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్లైసెమిక్ ఇండెక్స్ ఏం చెబుతోంది?

మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణంగా 51 నుండి 60 మధ్య ఉంటుంది. అంటే ఇది మోస్తరు గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణమే పెంచనప్పటికీ, పరిమితి దాటితే మాత్రం ప్రభావం చూపుతుంది. అందుకే దీనిని తినే విషయంలో 'పరిమాణం' చాలా ముఖ్యం.

షుగర్ పెరగకుండా ఉండాలంటే ఎలా తినాలి?.

మధుమేహం ఉన్నవారు మామిడి పండు తిన్నప్పుడు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి..

పరిమితి ముఖ్యం: రోజుకు ఒక చిన్న మామిడి పండు లేదా సుమారు 100 గ్రాముల కంటే ఎక్కువ పండును ఒకేసారి తినకపోవడం మంచిది.

జ్యూస్‌ వద్దు.. పండు ముక్కలే ముద్దు: మామిడి పండును రసంగా లేదా షేక్ రూపంలో తీసుకోవద్దు. పండును ముక్కలుగా కోసుకుని నేరుగా తినడం వల్ల అందులోని ఫైబర్ చక్కెరను నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తుంది.

నట్స్‌తో కలిపి తీసుకోండి:

మామిడి పండు తినేటప్పుడు కొన్ని నట్స్ కలిపి తింటే, అందులోని ప్రోటీన్ మరియు ఫ్యాట్ షుగర్ పెరగకుండా అడ్డుకుంటాయి.

ఖాళీ కడుపుతో వద్దు:

మామిడి పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం కంటే, భోజనానికి ముందు లేదా సాయంత్రం స్నాక్‌లా తీసుకోవడం ఉత్తమం.

ఫైబర్‌తో జత చేయండి:

మీ ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకుని, దానితో పాటు మామిడి పండు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ప్రతి వ్యక్తి శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మామిడి పండును మీ డైట్‌లో చేర్చుకునే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. మీ షుగర్ లెవల్స్‌ను బట్టి వారు ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఖచ్చితంగా సూచించగలరు.

మధుమేహం ఉన్నంత మాత్రాన మామిడి పండుకు పూర్తిగా దూరమవ్వాల్సిన పనిలేదు. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ మితంగా తింటే, మీరు కూడా మామిడి పండు రుచిని అక్షయంగా ఆస్వాదించవచ్చు

PolitEnt Media

PolitEnt Media

Next Story