✕
దేశ వ్యాప్తంగా 5వేలు దాటిన కరోనా కేసులు
By Politent News Web 1Published on 7 Jun 2025 12:46 PM IST

x
దేశంలో క్రమంగా మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో కోవిడ్ కేసులు 5000 దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 500 కరోనా కేసులు, నాలుగు మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5364కు చేరుకున్నాయి.అత్యధికంగా కేరళలో యాక్టివ్ కేసులు 1679కు చేరుకున్నాయి. తరువాత గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ(592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో రెండు మరణాలు సంభవించగా, కర్ణాటక, పంజాబ్లో ఒక్కొక్కరు మరణించారు. గత 24 గంటల్లో 764 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో, ఆక్సిజన్, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, అవసరమైన మందుల లభ్యతను నిర్ధారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

Politent News Web 1
Next Story