Crossed 40: వయసు నలబై (40) సంవత్సరాలు దాటిన తర్వాత మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది మన కంటి చూపు. చాలా మంది దీనిని కేవలం సాధారణ వృద్ధాప్య లక్షణంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ దశలో మన కళ్ళను ప్రత్యేకంగా సంరక్షించుకోవడం ఎంతైనా అవసరం.

నల్భై ఏళ్ల వయసు రాగానే కంటి లెన్స్‌లు తమ సాగే గుణాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల దగ్గరగా ఉన్న అక్షరాలు చదవడం కష్టమవడటం, పుస్తకాలు లేదా ఫోన్‌ని దూరంగా పెట్టి చదవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వైద్య పరిభాషలో దీనిని 'ప్రెస్ బైపియా' (Presbyopia) అంటారు. అంతేకాకుండా, కంప్యూటర్లు , మొబైల్ స్క్రీన్‌లను ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు త్వరగా అలిసిపోవడం, పొడిబారడం (Dry Eyes), తలనొప్పి వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కాలక్రమేణా కటరాక్ట్ (శుక్లాలు) లేదా గ్లకోమా వంటి తీవ్రమైన కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఈ వయసులోనే పెరుగుతుంది.

మరి ఈ సమస్యల నుండి మన కళ్ళను ఎలా కాపాడుకోవాలి?

మొదటిది, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కంటి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏవైనా సమస్యలుంటే ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.

రెండవది, ఆరోగ్యకరమైన ఆహారం! విటమిన్ ఎ, సి, ఇ , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు, మరియు సిట్రస్ జాతి పండ్లను మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.

మూడవది, ఎండలోకి వెళ్లేటప్పుడు యూవీ (UV) కిరణాల నుండి రక్షణ కల్పించే మంచి సన్‌గ్లాసెస్ ధరించడం అలవాటు చేసుకోవాలి.

అలాగే డిజిటల్ స్క్రీన్‌లను చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడటం ద్వారా కంటి అష్ట్రెయిన్‌ను తగ్గించవచ్చు. కళ్ళు మన శరీరంలో అత్యంత అమూల్యమైన భాగాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story