Health: పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?

Health:సీజన్లను బట్టి మార్కెట్లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఐరన్ నుండి పొటాషియం వరకు అనేక రకాల పోషకాలను అందిస్తాయి. సీజన్ పండ్లు వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందువల్ల అవి అందించే పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. కానీ కొంతమంది తెలిసి లేదా తెలియక పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
జలుబు, దగ్గు సమస్యలు
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగితే శరీరంలో కఫం పెరుగుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల దగ్గు వస్తుందని పెద్దలు చెప్తారు. పండ్లను భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత తినాలి. కానీ వాటిని తిన్న తర్వాత నీరు మాత్రం తాగకూడదు.
జీర్ణ సమస్యలు
పండ్లు తిన్న వెంటనే వాటర్ త్రాగడం వల్ల జీర్ణక్రియ స్లోగా అవుతుంది. దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరం పండ్ల నుండి పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. అంటే పూర్తి ప్రయోజనాల లభించవు. ముఖ్యంగా పుల్లని పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.
pH స్థాయిలలో మార్పులు
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరం యొక్క pH స్థాయి తగ్గుతుంది. కొన్ని పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల నీటి శాతం పెరుగుతుంది. కొంతమందిలో వాంతులు వస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు
పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది షుగర్ కు దారితీస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తిన్న వెంటనే నీరు త్రాగకూడదు.
