రోజుకు ఎన్ని లీటర్లు తాగాలి..?

Drinking Too Much Water Risky: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. అందుకే వైద్యులు ఎక్కువ నీరు తాగమని సలహా ఇస్తారు. అయితే అవసరానికి మించి నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలిసి లేదా తెలియకుండా ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు:

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత: అధిక నీటి వినియోగం శరీరంలోని ముఖ్యమైన లవణాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కిడ్నీలపై ఒత్తిడి: మూత్రపిండాలు నిరంతరం అధిక మొత్తంలో నీటిని ఫిల్టర్ చేయవలసి వస్తుంది. దీని వల్ల వాటిపై ఒత్తిడి పెరిగి, పనితీరుపై ప్రభావం పడుతుంది.

మెదడుపై ప్రభావం: ఎక్కువ నీరు తాగడం వల్ల మెదడు కణాలు ఉబ్బే అవకాశం ఉంటుంది.

తలనొప్పి, తలతిరుగుడు: కొంతమందికి అధిక నీటి వినియోగం వల్ల తలనొప్పి మరియు నిరంతరం తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.

రక్తపోటులో మార్పులు: ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలి?

సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం మంచిది. అయితే మీ శరీరం ఎక్కువగా చెమట పడుతుంటే దీని కంటే కొంచెం ఎక్కువ నీరు త్రాగడం అవసరం.

దాహం లేకపోయినా నీరు తాగవచ్చా?

దాహం వేయడం అనేది శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని సూచిస్తుంది. అయితే ఆ సంకేతం రాకముందే నీరు త్రాగడం వల్ల శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ నీరు త్రాగడం మంచిది.

మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ మూత్రం రంగును చూసి మీరు సరిగా నీరు తాగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. మూత్రం రంగు లేత రంగులో ఉంటే మీరు బాగా హైడ్రేట్ అయ్యారని అర్థం. ముదురు రంగులో ఉంటే మీరు మరింత నీరు తాగాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో మాత్రమే నీరు తాగడం చాలా ముఖ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story