తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. సానమాండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకార పింఛన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అంతకముందు జనరల్ స్టోర్‌కు వెళ్లి నిర్వాహకుడు కొండా వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.













































Updated On
Next Story