• రాజకీయాల్లో వదంతులు వ్యాప్తి చేయడం సహజం
  • గాసిప్ శృతి మించితే వికటిస్తుందంటున్న నేతలు
  • కలకలం రేపుతున్న తెలంగాణ బీజేపీ నేత వ్యాఖ్యలు

కొందరు నాయకులు యథాలాపంగా చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి పార్టీకి తలనొప్పులు తీసుకువస్తాయి. సదరు నాయకులు చేసే వ్యాఖ్యల కారణంగా పార్టీ ఇబ్బందుల పాలై వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్ధితి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఎదురయ్యింది. దీంతో ముందు పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడటానికి కొన్ని నిబంధనలను రూపిందించిది తెలంగాణ బీజేపీ. పార్టీ వేదికగా నాయకులు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలన టీబీజేపీ కొత్త నిబంధనల్లో స్పస్టం చేశారు. ఇంతకీ బీజేపీ ప్రెస్ మీట్ల విషయంలో ఈ విధంగా కొత్త నిబంధనలను రూపొందించుకోవాల్సి రావడానికి కారణం రెండు రోజుల క్రితం ఆపర్టీ మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీటే కారణం. రెండు రోజుల క్రితం ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందని తేల్చేశారు. అయితే ఈ విషయాన్ని అంతకు ముందు పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదు. పైపెచ్చే ప్రభాకర్ తన ప్రెస్ మీట్ లో ఈ అంశం ప్రాస్తావిస్తానని పార్టీకి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో షడన్ గా ప్రభాకర్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అనే సరికి ఇది రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించకుండానే ప్రభాకర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది.

దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. గాసిప్స్ వదిలి... పార్టీ క్రెడిబులిటీ దెబ్బతినకుండా చూసుకోవాలని అధికార ప్రతినిధులకు, పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. టీబీజేపీ రాష్ట్ర నాయకులు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారట. భవిష్యత్ లో పునరావృతం కాకుండా ఏం చేయాలనే దానిపై బీజేపీ అగ్ర నాయకులు చర్చించినట్లుతెలిసింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఏం మాట్లాడినా అది అధికారికమే అవుతుందని, ఈ నేపథ్యంలో కొత్త నిబంధన పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇకపై ప్రెస్ మీట్ పెట్టాలనుకునే వారు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ప్రెస్ మీట్ పాయింట్స్ ను ముందుగా పంపాలని రూల్ పెట్టారట. సంచలనాల కోసం గాసిప్స్ మాట్లాడి పార్టీ క్రెడిబులిటీ దెబ్బతీయవద్దని నేతలకు ముందుగానే సూచిస్తున్నారట.

అయితే నిత్యం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏదో ఒక అంశంపై ప్రెస్ మీట్ పెట్టాలనుకునే సీనియర్ నేతలకు ఈ నిబంధన కొంత ఇబ్బందికరంగా మారనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి... పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఎవరు మాట్లాడాలి ? ఏం మాట్లాడాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయన అందుబాటులో లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఫైనల్ చేస్తారు. అయితే కొంత మంది నేతలు మాత్రం ప్రెస్ మీట్ పాయింట్స్ ముందుగా చెప్పడానికి ఇష్టపడటం లేదట. దీంతో సమస్య వచ్చిపడుతోంది. తెలంగాణ బీజేపీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం పెట్టుకున్న కొత్త నిబంధనను నేతలు ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది అనుమానమే.

Updated On 23 May 2025 2:01 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story