Balochistan : బీఎల్ఏ దాడిలో 29 మంది పాక్ జవాన్లు మృతి
6నెలల్లో 286వ సారి దాడికి పాల్పడ్డ బలోచ్ లిబరేషన్ ఆర్మీ

పాకిస్తాన్ ఆర్మీ జవాన్లపై బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మారోసారి దాడికి పాల్పడింది. తాజాగా గురువారం పాక్ ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై బీఎల్ఏ బాంబుల దాడి చేసింది. ఈ దాడిలో 29 మంది పాక్ జవాన్లను హతం చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. తాము క్వెట్టా, జహు, కలాట్ ప్రాంతాల్లో ప్రాంతాల్లో దాడులకు పాల్పడినట్లు ఈ దాడుల్లో చాలా మంది గాయపడినట్లు బీఎల్ఏ వెల్లడించింది. గురు వారం పాక్ ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో దాడులు చేశామని ఆ సమయంలో బస్సులో 48 మంది పాక్ సైనికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ వర్గాలు తెలియజేశాయి. ఇదిలా ఉండగా గచిన ఆరు నెలల్లో బీఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీపై 286 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 700 మందికి పైగా పాక్ జవాన్లు హతమయ్యారు. పాక్ ఆర్మీపై ఈ దాడులు ఇంకా కొనసాగిస్తామని బీఎల్ఏ పేర్కొంది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం సిద్దించేంత వరకూ పాక్ సైన్యంపై దాడులు జరుగుతూనే ఉంటాయని బీఎల్ఏ స్పష్టం చేసింది.
