సునామీ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా

అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాల‌మానం ప్రకారం మ. 12:37 గం.లకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కి.మీ దూరంలో ఉంది. భూకంపకేంద్రం 20.1 కి.మీ లోతులో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పాల్లో సునామీ సంభవించే అవకాశం ఉంద‌ని అలాస్కా పామర్‌లోని జాతీయ సునామీ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కా కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుంచి యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడిందని కేంద్రం తెలిపింది. కాగా, 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో భూకంపం బారిన పడింది. ఇది ఉత్తర అమెరికాలో నమోదైన అత్యంత బలమైన భూకంపం. ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను ముంచెత్తిన సునామీని సృష్టించింది. భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story