• ఈ పదవి పొందిన మొదటి వ్యక్తి ఆయుబ్ ఖాన్
  • తనకు తానే పదోన్నతి ఇచ్చుకున్నఖాన్
  • ఆసిం మునీర్ రెండో వాడు
  • మునీర్ కు పదోన్నతి కల్పించిన పాక్ ప్రభుత్వం
  • భారత్ పై ఉగ్రదాడులకు పరోక్షంగా ఉసికొల్పిన మునీర్
  • 2027 వరకూ పదవిలో కొనసాగనున్న మునీర్

మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా పాక్ అప్పుల కుప్పగా మారుతున్నా.. దాని వైఖరి మార్చుకోవడం లేదు. భారత్ పై అదేపనిగా, పదే పదే విషం కక్కుతూ, సరిహద్దుల దగ్గర ఉగ్రదాడులకు ఊతమిస్తున్న పాకిస్థానీ ఆర్మీ చీఫ్ కి అక్కడి ప్రభుత్వం ఏకంగా పదోన్నతి కల్పించింది. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కు ఫీల్డ్ మార్షల్ పదవినిచ్చి సత్కరించింది. పాక్ చరిత్రలో ఇలా అవార్డు తీసుకున్న వారిలో మునీర్ రెండో వాడు. గతంలో ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ కు మాత్రమే దక్కింది.

1958నుంచి 1969 వరకూ పాకిస్థాన్ అధ్యక్షుడుగా పనిచేసిన మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ను పాకిస్థాన్ ఆర్మీలోనే తొలి ఫీల్డ్ మార్షల్ గా చెబుతారు.1958లో అతిపెద్ద సైనిక కుట్రకు పాల్పడి ఆయుబ్ఖాన్ పాకిస్థాన్ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టారు.ఇందులో ఆయూబ్ ఖాన్ దేశానికి చేసినది ఏమీ లేదు.ఆ తరువాత ఏడాది రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్నందున ఆయుబ్ ఖాన్ తనకు తానే ఫీల్డ్ మార్షల్ పదోన్నతి కల్పించుకున్నారు.పైగా పాక్ ప్రజలు ఆయనకు పదోన్నతి రావాలని కలలు కంటున్నారని బుకాయించారు.1959లో ఫీల్డ్ మార్షల్ పదోన్నతి కల్పిస్తూ ఒక ప్రొక్లమేషన్ కూడా అప్పటి అధ్యక్ష కేబినెట్ ప్రకటించుకుంది.ఫీల్డ్ మార్షల్ పదోన్నతి కల్పించుకున్నాక ఆయన అసలు పని చేసిందేలేదు.మూసాఖాన్ అనే వ్యక్తిని కమాండర్ ఇన్ చీఫ్ ఆప్ పాకిస్థాన్ ఆర్మీ కింద అపాయింట్ చేశారు.అప్పటినుంచి ఆయన ఆర్మీ సంగతి పట్టించుకోకుండా పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టారు.

ఇద్దరికీ ఎంత తేడా?

గతంలో ఆయుబ్ ఖాన్ తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకోగా ప్రస్తుత ఆసిమ్ మునీర్ కు మాత్రం పాకిస్థాన్ ప్రభుత్వం పౌరసమాజం ఈ పదోన్నతి కట్టబెడుతున్నట్లుగా ప్రధాని పేరున సర్క్యులర్ జారీ అయింది. అప్పట్లో ఆయుబ్ ఖాన్ పదోన్నతి పొందగానే చీఫ్ ఆఫ్ ఆర్మీగా మరొకరిని నియమించాడు. కానీ ఆసిమ్ మునీర్ తన రిటైర్మెంట్ వరకూ చీఫ్ ఆఫ్ ఆర్మీగా కొనసాగుతారు. వాస్తవానికి ఆసిమ్ మునీర్ ఈ ఏడాది రిటైర్ కావల్సి ఉంది. కానీ 2024 నవంబర్ లో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ చీఫ్ ల పదవీకాలం మూడు నుంచి అయిదేళ్లకు పెంచింది. దాంతో ఆసిమ్ మునీర్ 2027 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.

మునీర్ ఎదిగిన తీరు!!

ఆసిమ్ మునీర్ కు యుద్ధకాంక్ష ఎక్కువ. పొరుగుదేశంపై దాడులకు పాల్పడే స్వభావం. భారత్ పై జరిగిన ఉగ్రదాడులన్నీ ఇతగాడి ఏలుబడిలో సాగినవే.. మునీర్ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్ నుంచి కమిషన్డ్ ఆఫీసర్ గా బయటకు వచ్చాడు. ఆయనకు స్వార్డ్ ఆఫ్ ఆనర్ పురస్కారం కూడా లభించింది.జపాన్ ఫ్యూజీ స్కూల్ లో కెరీర్ కోర్సు పూర్తి చేసి క్వెట్టాలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలోనూ, కౌలాలంపూర్లోని మలేసియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ డిఫెన్స్ కాలేజి, ఇస్లామాబాద్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలోనూ కోర్సులు పూర్తిచేశాడు. సౌదీ అరేబియాలో పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఇస్లామిక్ స్టడీస్ పూర్తి చేసి ఖురాన్ ను కూడా కంఠస్థం చేశాడు. అక్కడ నుంచి అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ 2019లో పుల్వామా దాడి తర్వాత లెఫ్టినెంట్ జనరల్ గా ప్రమోషన్ అందుకున్నాడు.

Updated On 23 May 2025 2:03 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story