ఆపరేషన్‌ సిందూర్‌ భారత ప్రభుత్వ ఆపరేషన్‌కు సంబంధించి.. పాకిస్తాన్ మరోసారి ఓ వాస్తవాన్ని అంగీకరించింది. అజర్‌బైజాన్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, బ్రహ్మోస్ క్షిపణులతో భారత దళాలు పాక్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయన్నారు. మే 9-10 అర్థరాత్రి సమయంలో తమ సైన్యం కూడా ప్రత్యుత్తర దాడికి సిద్ధమవుతున్న సమయంలోనే.. అప్పటికే భారత్ వైపు నుంచి అటాక్ జరిగిపోయిందని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, తెల్లవారు జామున 4:30 గంటలకు దాడి చేయాలని పాక్ సైన్యం నిర్ణయించిందని, అయితే, ఆ సమయానికే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయం సహా పలు ప్రాంతాలపై దాడి చేసిందని పాక్‌ ప్రధాని వెల్లడించారు.

ఈ పరిణామాలకు సంబంధించి షెహబాజ్‌ షరీఫ్‌ రెండోసారి అధికారికంగా చేసిన అంగీకార ప్రకటన ఇది. భారత ఆపరేషన్ సిందూర్‌ కారణంగా పాకిస్థాన్‌కు తలదించుకునే పరిస్థితి ఎదురైందని ఆయన స్వయంగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన ఘటనకు ప్రతిస్పందనగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ఉగ్ర స్థావరాల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థల సభ్యులు ఉన్నారు. ఈ దాడులలో వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

దీంతో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లోని తీవ్ర వాద శిబిరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారత దాడులకు ప్రతిగా పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి పౌర ప్రాంతాలపై దాడి చేయగా, భారత్ సైనిక స్థావరాలపై బలమైన ప్రతిదాడులకు దిగింది. మే 10వ తేదీన ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, అదే రోజు పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. షరీఫ్ తాజా వ్యాఖ్యలు ఈ ఘటనల వెనుక ఉన్న యథార్థాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.



Politent News Web4

Politent News Web4

Next Story