అతను ఎవరు?

Charlie Kirk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడైన కన్జర్వేటివ్ ఆక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో భారతీయుల గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతదేశం నుంచి వచ్చే వలసదారులకు అమెరికా మరిన్ని వీసాలు అవసరం లేదని కిర్క్ స్పష్టం చేశారు. దేశం ఇప్పటికే ఓవర్‌పాపులేటెడ్ అయిందని, స్వదేశీయ పౌరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన హితవు పలికారు.

అమెరికాలోని ఉద్యోగాలు చట్టపరమైన వలసల వల్ల స్వదేశీయుల నుంచి భారతీయుల వైపు మారాయని కిర్క్ పేర్కొన్నారు. ‘భారత్ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు. చట్టపరమైన వలసల కారణంగా అమెరికన్ వర్కర్ల స్థానాల్లో భారతీయులు చేరిపోయారు. ఇక చాలు. అమెరికా నిండిపోయింది. మన స్వదేశీయులకు మొదటి ప్రాధాన్యత ఇద్దాం’ అంటూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 2న చార్లీ కిర్క్ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ యొక్క నేపథ్యం ఇలా ఉంది: ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత లారా ఇంగ్రహామ్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి ఓ పోస్ట్ చేశారు. ఆ ఒప్పందం కుదుర్చుకోవాలంటే భారతదేశానికి మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఆమె సూచించారు. దానికి ప్రతిస్పందనగా చార్లీ కిర్క్ భారతీయ వలసదారులపై ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

చార్లీ కిర్క్ ఎవరు?

చార్లీ కిర్క్ ‘టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ’ అనే యువతా సంస్థకు సీఈవో మరియు సహ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ నడిపిన రైట్-వింగ్ రిపబ్లికన్ ఉద్యమానికి ఆయన బలమైన మద్దతుదారుగా నిలుస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story