Ukraine: రష్యా క్షిపణి, డ్రోన్‌ దాడులు ఉక్రెయిన్‌లోని సూపర్‌మార్కెట్‌ గిడ్డంగులు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడంతో దుకాణాల్లో కొన్ని వస్తువులు కొరతగా మారాయి. కీవ్‌తో పాటు ఇతర నగరాల్లోని సూపర్‌మార్కెట్లలో కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, పిండి, చక్కెర వంటి వస్తువుల అరలు ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఆగస్టు 5 రాత్రి జరిగిన రష్యా దాడుల్లో పెద్ద ఎత్తున గిడ్డంగులు నాశనమయ్యాయి. దీంతో లాజిస్టిక్స్‌ గొలుసు అంతరాయం కలిగింది. కొన్ని దుకాణాల్లో ‘‘ఈ వస్తువును రష్యా నాశనం చేసింది’’ అని రాసిన బోర్డులు కనిపిస్తున్నాయి. ఫోరా, నోవస్‌, సిల్పో వంటి చైన్‌లు తాత్కాలిక సరఫరా సమస్యలు ఉన్నాయని అంగీకరించాయి. అయితే పరిస్థితి మెరుగుపడుతోందని, ఆగస్టు 24 నాటికి పూర్తిగా స్థిరపడుతుందని హామీ ఇస్తున్నాయి.

ఉక్రెయిన్‌ వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా ఆహార కొరత లేదని స్పష్టం చేశారు. ప్రధాన వస్తువుల నిల్వలు సరిపోతున్నాయని, కేవలం డెలివరీ మార్గాల్లో అంతరాయం ఉందని చెప్పారు. ధరల్లో పెద్ద మార్పులు లేవని పేర్కొన్నారు. రిటైలర్లు ప్రత్యామ్నాయ గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటూ లాజిస్టిక్స్‌ను పునరుద్ధరిస్తున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం రష్యా దాడుల్లో సుమారు 4 లక్షల చదరపు మీటర్ల గిడ్డంగి స్థలం నాశనమైంది. అయినా దేశంలో ఆహార భద్రతకు ప్రమాదం లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ కాలంలో ఇది ఉక్రెయిన్‌ ప్రజలకు కొత్త ఇబ్బందిగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story