ప్రపంచ భద్రతలో భారత్ అత్యవసర భాగస్వామి

House Select Committee on China: అమెరికాలోని ‘హౌస్ సెలక్ట్ కమిటీ ఆన్ చైనా’ అధిపతి జాన్ ములెనార్, ప్రపంచ రక్షణలో భారత్‌కు తమకు అత్యవసరమైన భాగస్వామిగా భారత్‌ను వర్ణించారు. ఇటీవల అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వత్రాతో జరిగిన సమావేశంలో ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య, సాంకేతికతల సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు. గురువారం కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఈ చర్చల్లో ప్రాంతీయ భద్రత, ఉత్పత్తి, వాణిజ్య రంగాలపై ఇరుపక్షాలు చర్చించాయి. అదే సమయంలో చైనా నుంచి కీలక తయారీ రంగాన్ని మళ్లించడంపై కూడా వివరణాత్మకంగా మాట్లాడుకున్నాయని ప్రకటనలో తెలిపారు. జాన్ ములెనార్ మాట్లాడుతూ, చైనా దౌర్జన్యాలను నేరుగా ఎదుర్కొన్న భారత్ ప్రపంచ భద్రతలో కీలక భాగస్వామిగా నిలుస్తోందని అభివర్ణించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అమెరికా సెక్యూరిటీ భాగస్వామిగా ఉందని, ఇరుదేశాల రక్షణ పరిశ్రమల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని ఆయన చెప్పారు. ఇది అమెరికన్ ప్రజల రక్షణకు ఎంతో సహాయకరంగా ఉంటుందని తెలిపారు. చైనా ప్రభావాన్ని తమ ప్రజలపై నియంత్రించకపోతే స్వతంత్రతకు ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story