Advisory for Indian Citizens: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి భారత పౌరులందరూ తక్షణమే ఇరాన్‌ను వీడాలని సూచించింది.

ఎంబసీ విడుదల చేసిన అడ్వైజరీలో, ‘‘పశ్చిమాసియాలో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత పౌరులు ప్రస్తుతం ఇరాన్‌కు ప్రయాణాలు చేయవద్దు. ఇరాన్‌లో ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా సాధనాల ద్వారా వెంటనే బయలుదేరాలి’’ అని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి భారత్ పలుమార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటికే 1,600 మందికి పైగా భారతీయులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించింది. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల నుంచి సుమారు 6 లక్షల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి:

ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేసింది. దీనికి ఇజ్రాయెల్ బలమైన ప్రతిస్పందన ఇచ్చింది. టెహ్రాన్ సమీపంలోని మషహర్ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసి తీవ్రంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ కాంప్లెక్స్ ఇరాన్ పెట్రోకెమికల్స్ ఎగుమతుల్లో కీలకమైనది.

భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే భారత ఎంబసీని సంప్రదించాలని సూచించారు. పరిస్థితి మరింత క్లిష్టమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story