మా పనే అని ప్రకటించుకున్న ఇజ్రాయిల్‌

ఇరాన్‌ ప్రభుత్వ న్యూస్‌ ఛానల్‌ పై సోమవారం రాత్రి ఇజ్రాయిల్‌ క్షిపణులతో దాడికి పాల్పడింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లో ఉన్న ప్రభుత్వా వార్తా చానల్‌ ఇరిన్‌ ప్రధాన కార్యాయంపై ఇజ్రాయిల్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయిల్‌ క్షిపణుల దాడి చేస్తున్న ఆ సమయంలో న్యూస్‌ రూమ్‌ లో మహిళా యాంకర్‌ సహర్‌ ఎమామి వార్తలు చదువుతున్నారు. ఈ సమయంలో భవనంపై ఇజ్రాయిల్‌ చేసిన క్షిపణి దాడికి సంబంధించిన శబ్దాలు లైవ్‌లో వినిపించాయి. క్షిపణి పేలుడు ధాటికి స్టూడియో మొత్తం దుమ్ము ఆవరించి ఏదీ కనిపించని పరిస్ధితి నెలకొంది. క్షిపణి దాడి వల్ల స్టూడియోలో న్యూస్‌ యాంకర్‌ వెనుక ఉన్న స్క్రీన్‌ తెగి కిందపడిపోయింది. క్షిపణి విస్పోటన శబ్ధానికి భయపడిపోయిన సహర్ ఎమామి స్టూడియోలోంచి బయటకు పరుగులు తీశారు. దీంతో కొద్ది సేపు ఇరిన్‌ టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. కొద్ది సమయానికే తేరుకున్న సహర్‌ ఎమామి మరో యాంకర్‌ తో కలసి మరో అదే భవనంలో ఉన్న మరో స్టూడియోలో ప్రసార కార్యక్రమాలను కొనసాగించారు. ఈ పేలుడు కారణంగా టీవీ ఛానల్‌ భవనం అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. భవనం ఇతర భాగాల్లో క్షిపణి దాడుల వల్ల చెలరేగిన మంటల వీడియోలు ఇర్విన్‌ టీవీ టెలికాస్ట్‌ చేసింది.

అయితే దాడికి గంట ముందే ఇర్విన్‌ టీవీ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఇజ్రాయిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌ చేస్తున్న దుష్ప్రచారానికి ప్రధాన ప్రచార సాధనం ఇర్విన్‌ టీవీనే అని భావిస్తున్న ఇజ్రాయిల్‌ ఈ దాడికి పాల్పడినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ ప్రకటించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story