యుద్ధాన్ని ఆపాలి : కేఏ పాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ. భారత్ విశ్వగురు. విశ్వ గురువు అని చెప్పుకోవడం కాదు. నిరూపించాలని. నిరూపించుకోవాలని అన్నారు. భారత్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మోడీకి దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు. ఆ దేశ అధ్యక్షులకు లేఖలు రాయాలని. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు ఇరాన్తో శాంతి చర్చలు జరపకుండా హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే 10 నుంచి 20 కోట్ల మంది చనిపోతారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని మండిపడ్డారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారందరికీ కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విమాన ప్రమాదంలో చనిపోయిన మెడికల్ కాలేజీ విద్యార్థులకు నష్ట పరిహారం ప్రకటించాలని, వారు మనుషులు కాదా..? అని ప్రశ్నించారు. ఎయిరిండియా ప్రమాద బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతానంటూ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story