300 people buried!

అహ్మదాబాద్లో బోయింగ్ విమానం కూలిపోయిన దుర్ఘటనలో డెత్టోల్ భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. విమానంలోనే సిబ్బంది, పైలట్, కెప్టెన్ సహా 242 మంది ప్రయాణాకులు ఉండగా.. ఆ విమానం పోయి పోయి ఓ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలడం, పైగా.. సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రమాదం జరగడంతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అహ్మదాబాద్లోని బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్మీద విమానం కూలిపోయింది. ఆ సమయంలో కాలేజీ నుంచి వైద్య విద్యార్థులందరూ భోజనం చేసేందుకు హాస్టల్కు వచ్చారు. డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్నారు. అదే సమయంలో పెద్ద శబ్దంతో విమానం ఆ భవనంపై కూలిపోయింది. పైగా పెద్ద విస్ఫోటనం సంభవించడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ బృందాలు ఆ భవనంలోకి వెళ్లిన సమయంలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. డైనింగ్ హాల్లో టేబుళ్లలో సగం తిన్న ఆహారం ప్లేట్లు ప్రమాదం తీవ్రతకు అద్దం పట్టాయి. అంతేకాదు.. కొంతమంది విద్యార్థుల శరీర భాగాలు తెగిపోయి రాకెట్లలా దూసుకెళ్లి దూరంగా పడిపోయాయి.
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన లండన్ వెళ్లే బోయింగ్ విమానం కొద్ది క్షణాల్లోనే క్రాష్ అయ్యింది. సమీపంలోని భవనాలపై పడిపోయింది. అయితే, విమానం కూలిపోయిన భవనం వైద్య కళాశాల హాస్టల్కు సంబంధించినది. బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదంలో పలువురు పీజీ వైద్య విద్యార్థులు చనిపోయారు. భోజన సమయం కావడంతో హాస్టల్లోనే అధిక శాతం విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ సహా ఆ సమీపంలోని భవనాలకు మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. విమానం మంటల కారణంగా చనిపోయిన వైద్య విద్యార్థుల మృతదేహాలను, గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్సులలో వెంట వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కడపటి సమాచారం అందే సరికి సుమారు 40 మందికి పైగా మెడికోలు చనిపోయినట్లు చెబుతున్నారు. మరో 16 మంది మెడికల్ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.
