ఇద్దరు మృతి... ఇరవై మందికి గాయాలు

హిమాచల్‌ రాష్ట్రంలోని మండి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరవై నుంచి ఇరవైఐదు మంది ప్రయాణికులు ఉన్న బస్సు మండి జిల్లాలో అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమచారం. రెస్క్యూ బృందాలు సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం సంభవించగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణం పోలీసుల ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు మండి పోలీసులు చెపుతున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story