ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం

Centre Issues New Guidelines for Air Ticket Prices: దేశవ్యాప్తంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న ఇండిగో విమానయాన సంక్షోభం ప్రయాణికులను ఇబ్బంది పడుతున్న దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు ప్రవేశపెట్టింది. విమానాల రద్దులు, ఆలస్యాలు, లగేజీ సమస్యలతో బాధపడుతున్న ప్రయాణికుల రక్షణ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌లు జారీ చేసింది. ముఖ్యంగా, దేశీయ విమానాల టికెట్ ధరలపై కట్టుబాటు పరిమితులు విధించి, అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఇండిగోతో పాటు ఇతర డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు వర్తించే ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణ దూరం ఆధారంగా గరిష్ఠ ఛార్జీలు నిర్ణయించబడ్డాయి. 500 కిలోమీటర్ల దూరానికి రూ.7,500 మాత్రమే, 1,000 కి.మీ. వరకు రూ.12,000, 1,500 కి.మీ. వరకు రూ.15,000, మరి అంతకంటే ఎక్కువ దూరాలకు రూ.18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నియమాలు బిజినెస్ క్లాస్, RCS (రీజియనల్ కనెక్టివిటీ స్కీమ్) మరియు UDAN (ఉడాన్) విమానాలకు వర్తించవని, అయితే సాధారణ ఎకానమీ క్లాస్‌కు తప్పనిసరి అని తెలిపింది. ఈ గైడ్‌లైన్స్‌లను ఉల్లంఘించి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విమానయాన సంస్థలకు హెచ్చరించింది.

సంక్షోభం కారణంగా రద్దయ్యిన లేదా ఆలస్యమయ్యిన విమానాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న టికెట్ డబ్బులను 24 గంటల్లోపు ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని, లగేజీలను 48 గంటల్లో వారి చోటికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించి, విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం, రాబోయే 24 గంటల్లో విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చింది. ఇండిగో సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా టికెట్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ గైడ్‌లైన్స్‌లు ప్రయాణికులకు ఊరట కలిగించాయి. విమానయాన రంగంలో స్థిరత్వం కోసం కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టనుందని సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story