CJP’s ‘Chalo Parliament’ March: నీట్‌-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో పార్లమెంట్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజున నిర్వహించిన ఈ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకొని పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేశారు. భాష్పవాయువు గోళాలను కూడా ప్రయోగించారు. కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని సమాచారం. ఢిల్లీలోని ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ భవనం లోపల ఈ భేటీ జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

అలాగే, ‘చలో పార్లమెంట్‌’ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను జేపీ నడ్డా కలవనున్నారని సమాచారం.

ఈ నిరసనలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story