కర్ణాటకలో నాయకత్వ మార్పు.. డీకే శివకుమార్ సీఎం అవకాశాలు ప్రకాశవంతం

CM Siddaramaiah Resigns: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి లేఖ అందజేశారు. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై అధికారిక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

అనంతరం మంత్రులు డీకే శివకుమార్, జి. పరమేశ్వర్‌తో కలిసి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, "అధిష్ఠానం సూచనల మేరకు రాజీనామా చేశాను. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం" అని ప్రకటించారు.

సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు:

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

జాతీయ రాజకీయాలకు వెళ్లాలని హైకమాండ్ సూచించినా, రాజకీయాల నుంచి వైదొలగడం లేదు. ఎమ్మెల్యేగా కొనసాగుతాను.

తన రాజకీయ జీవితాన్ని పొరపాటున ప్రారంభమైన ప్రయాణంగా అభివర్ణించారు.

సిద్ధరామయ్య సాధించిన విజయాలు:

మ్యానిఫెస్టోలోని 160 హామీల్లో 158 నెరవేర్చినట్లు తెలిపారు.

మొదటి ఏడాదిలోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని గుర్తు చేశారు.

ఈ సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. శనివారం జరిగే కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకునే దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story