అహ్మదాబాద్‌ లో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమాన ప్రమాదం మరువక ముందే మరో విమాన ప్రమాదం ఆదివారం వేకువ జామున జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్న ఏడుగురూ మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం వేకువ జామున 5.20 గంటల ప్రాంతంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో హెలికాఫ్టర్‌ ప్రమాదం సంభవించింది. కేదార్‌ నాథ్‌ ధామ్‌ నుంచి గుప్త కశీ వెళుతున్న హెలీకాఫ్టర్‌ గౌరీ కుండ్‌ సమీపంలో కూలిపోయినట్లు ప్రాధామిక సమాచారం. ఈ హెలీకఫ్టర్‌ కూలిపోయిన సమయంలో పైలట్‌ తో పాటు ఐదుగురు ప్రయాణికులతో పాటు 1 బాలుడు కూడా ఉన్నారు. హెలీకాఫ్టర్‌ లో ఉన్న ప్రయాణికులు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌ పౌర విఆనయాన అభివృద్ధి అధారిటీ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఆర్యన్‌ కంపెనీకి చెందిన ఈ హెలీకాఫ్టర్‌ ఆదివాం ఉదయం కేదార్‌నాథ్‌ నుంచి గుప్తకాశీకి వెళుతూ మార్గమధ్యంలో గౌరీకుండ్‌ త్రిజుగి నారాయణ్‌ ల మధ్య కుప్పకూలిపోయింది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తవ్ర గాయాలు కాగా వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందనట్లు చెపుతున్నారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెపుతున్నారు.

Updated On 15 Jun 2025 10:42 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story