• కేదార్ నాథ్ యాత్రలో అపశృతి..
  • గాల్లోకి లేచిన వెంటనే కొద్ది సేపటికి ఇబ్బంది
  • గుప్త కాశీ హైవేపై ల్యాండింగ్
  • ఐదుగురు ప్రయాణికులు సురక్షితం..
  • పైలట్ కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు
  • రుద్ర ప్రయాగ్ లో ఈ మధ్యాహ్నం ఘటన

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ కు హెలికాప్టర్ లో వెళుతున్న ఐదుగురు ప్రయాణికులకు ముప్పు తప్పింది.హెలికాప్టర్ హైవే, నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కెస్ట్రెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఐదుగురు ప్రయాణికులను తీసుకుని రుద్రప్రయాగ్‌ నుంచి ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ కు బయల్దేరింది.సెర్సిలోని బదాసు హెలిపాడ్ నుంచి మధ్యాహ్నం 12.52నిమిషాలకు ఛాపర్ గాల్లోకి ఎగిరింది. అయితే సాంకేతిక లోపంతో ఆ వెంటనే రుద్ర ప్రయాగ్ లోని గుప్తకాశీ మెయిన్ రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో కలెక్టివ్ కంట్రోలింగ్ వ్యవస్థ స్తంభించిపోయింది.పైలెట్ కెప్టెన్ఆర్. సి. సోధి చాపర్ ను హైవేపై ఎలాంటి ప్రమాదం జరగకుండా దింపేశారు. ఈ ఘటనలో రోడ్డుపై ఉన్న కారు ధ్వంసమైంది. పైలట్ కు గాయాలయ్యాయి. ప్రమాద ఘటన తెలియడంతో స్థానికులు పరుగుపరుగున రోడ్డుపైకి వచ్చారు.ప్రయాణికులందరూ సురక్షితమేనని గాయపడిన పైలట్ ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించామని జిల్లా టూరిజం డెవలప్ మెంట్ అధికారి తెలిపారు.ఘటన తర్వాత విమాన సర్వీసులేవీ ఆపలేదని, యధాప్రకారం పనిచేస్తున్నాయని సివిల్ ఏవిఏషన్ డైరక్టర్ జనరల్ ప్రకటించారు.

చార్ ధామ్ యాత్ర సమయంలో ఈ మధ్యన తరచుగాహెలికాప్టర్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతనెలలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ కూడా ఇలాగే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.హెలికాప్టర్ తోక భాగంలో ప్రొపెల్లర్ తిరగకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

గతనెల మే 8న ఇలాగే చార్ ధామ్ యాత్రకు వెళుతున్నహెలికాప్టర్ ఉత్తర కాశీలో కుప్పకూలడంతో పైలట్ తో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story