Inspired by the Money Heist Series: మనీ హీస్ట్ సిరీస్చూసి ప్రేరణ .. 150 కోట్లు దోచుకున్న మోసగాడు గ్యాంగ్!
150 కోట్లు దోచుకున్న మోసగాడు గ్యాంగ్!

Inspired by the Money Heist Series: ప్రసిద్ధ నెట్ఫ్లిక్స్ సిరీస్ 'మనీ హీస్ట్'లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా ఉపయోగించుకుని ముగ్గురు యువకులు ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా, వాట్సాప్లో వందల గ్రూప్లు ఏర్పాటు చేసి, స్టాక్ మార్కెట్ చిట్కాలు, డబ్బు రెట్టింపు చేసే రహస్యాలు వంటి ఆకర్షణీయ పేర్లతో వందలాది మందిని మోసం చేశారు. ఈ మోసగాళ్ల గ్యాంగ్ మొత్తం రూ.150 కోట్లకు పైగా దోచుకుంది. ఆన్లైన్ బిజినెస్ పేరుతో వాట్సాప్ గ్రూప్ల ద్వారా మరో రూ.23 కోట్లు లూటీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ సైబర్ పోలీసులు బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అర్పిత్, ప్రభాత్, అబ్బాస్గా గుర్తించిన నిందితులు చైనా సైబర్ మాఫియాతో ముడిపడి ఉన్నట్లు అనుమానం.
సిరీస్ పాత్రల పేర్లతో మోసాలు.. వందల మంది బెదిరింపు
నెట్ఫ్లిక్స్లో విడుదలైన థ్రిల్లర్ సిరీస్ 'మనీ హీస్ట్'ను ఈ మోసగాళ్లు ప్రేరణాధారంగా తీసుకున్నారు. సిరీస్లోని ప్రధాన పాత్రల పేర్లతోనే సోషల్ మీడియాలో గ్రూప్లు సృష్టించి, మొదట్లో కొంతమందికి చిన్న ప్రాఫిట్లు చూపించి విశ్వాసం కలిగించుకున్నారు. తర్వాత ఎక్కువ మొత్తాలు పెట్టినవారి అకౌంట్లను బ్లాక్ చేసి, కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఎదురుకోడానికి ప్రయత్నించిన 300 మందిని బ్లాక్మెయిల్ చేసి, మరిన్ని మొత్తాలు డిపాజిట్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
లగ్జరీ జీవితం.. చైనా మాఫియా కనెక్షన్?
నిందితులు ఢిల్లీలోని లగ్జరీ హోటల్స్లో ఉంటూ, అధునాతన మొబైల్లు, ల్యాప్టాప్లతో మోసాలు చేస్తూ ఉండేవారు. అరెస్ట్ తర్వాత పోలీసులు వారి నుంచి 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్బుక్లు, 32 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాల వెనుక చైనా సైబర్ మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని దర్యాప్తులు కొనసాగుతున్నాయి.

