భారత దేశంలో 24 కోట్ల మందికిపైగా ముస్లింలు గర్వంగా, తలెత్తుకొని జీవిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. పహల్గామ్‌ టెర్రర్‌ ఎటాక్‌, అనంతరం ఆపరేషన్‌ సింధూర్‌ పరినహాలకు సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ ప్రచార పర్యటనలో భాగంగా అఖిల పక్ష నేతలు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఈ బృందంలో సభ్యుడిగా సౌదీ అరేబియా వెళ్లిన అసదుద్దీన్‌ ఓవైసీ అక్కడ పాకిస్తాన్ కుయుక్తలను ఎండగట్టారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య వివాదాన్ని పాకిస్తాన్‌ దేశం.. హిందూ-ముస్లింల మధ్య సమస్యగా క్రియేట్‌ చేస్తోందని, ఇదంతా పాకిస్తాన్‌ కుట్ర పూరితంగా చేస్తోందని అసదుద్దీన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

భారత దేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్లామిక్‌ పండితులు ఉన్నారని గుర్తు చేశారు. ముస్లిం దేశాలకు తప్పుడు సందేశం ఇవ్వడమే పాకిస్తాన్‌ ఓ క్యాంపెయిన్‌గా పెట్టుకుందని, ఇది దురదృష్టకరమన్నారు. భారత్‌లో ఉన్న ఇస్లాం పండితులతో ప్రపంచంలోని ఏ పండితులూ సాటి రారని, అత్యుత్తమంగా అరబిక్‌ భాషను మాట్లాడగలిగే వాళ్లు భారత్‌లో ఉన్నారని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. తాము ముస్లిం దేశం అయినందునే భారత్‌ దెబ్బకొడుతోందని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్‌ చేయడం మానుకుంటుందో.. అప్పుడే దక్షిణాసియాలో స్థిరత్వం నెలకొంటుందని అన్నారు.

వాళ్ల సైనిక శక్తి గురించి పాకిస్తాన్‌ ప్రగల్భాలు పలుకుతోందని అసదుద్దీన్‌ విమర్శించారు. మే 9వ తేదీన జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరిస్తూ.. పాకిస్తాన్‌లోని తొమ్మిది వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నామని, అయితే, భారత్‌ తలచుకుంటే.. ఆ వైమానిక స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేయగలిదగేదని.. కానీ, పాకిస్తాన్‌ను హెచ్చరించేంఉదకు మాత్రమే ఆ టార్గెట్‌ను వాళ్లకు రుచి చూపించామన్నారు. తొమ్మిది ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను మాత్రమే భారత్‌ నేలమట్టం చేసిందన్నారు. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు నమాజ్‌ చేయించిన వ్యక్తి అమెరికాచే ప్రకటించబడిన ఉగ్రవాది కావడం బాధాకరమన్నారు అసదుద్దీన్‌ ఒవైసీ.


Politent News Web4

Politent News Web4

Next Story