నలుగురు బాధ్యులను డిస్మిస్ చేసిన యాజమాన్యం

ఎయిర్‌ ఇండియా కార్యాలయంలో ఉద్యోగులు పార్టీ చేసుకుని, నృత్యాలు చెయ్యడంపై ఆ కంపెనీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహ్మదాబాద్‌ లో ఎయిర్‌ ఇండియాకి చెందిన బోయింగ్‌ 787 విమానం కూలి పది రోజులు కాకుండానే ఆఫీస్‌లో సదరు విమానయాన సంస్ధ సిబ్బంది పార్టీ చేసుకుని, డ్యాన్సులు వేస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు రావడంతో ఎయిర్‌ ఇండియా సంస్ధ అంతర్గత దర్యాప్తు నిర్వహించింది. అయితే ఉద్యోగస్తులు అలా కార్యాలయంలో పార్టీ చేసుకుని డ్యాన్సులు చెయ్యడం. అదీ సంస్ధకు చెందిన విమానం కూలి 275 మంది మృత్యువాత పడి పది రోజులు కాకుండానే తమ ఉద్యోగలు ఆఫీసులో సంబరాలు చేసుకోవడంపై ఎయిర్‌ ఇండియా యాజమాన్యం సీరియస్‌ గా తీసుకుంది. ఈ చర్యకు సంబంధించి నలుగురు సీనియర్‌ అధికారులను బాధ్యులను చేస్తూ వారిని డిస్మిస్‌ చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story