వెల్లడికానున్న కీలక సమాచారం

Air India Flight Crash: గురువారం అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంకు సంబంధించి అత్యంత ముఖ్యమైన బ్లాక్ బాక్స్ కనిపించింది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. బ్లాక్ బాక్స్లలో రికార్డ్ చేయని సాంకేతికతను 'మేడే' అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్ ఓ సందేశాన్ని పంపుతారు. ఆ సమయంలో పైలట్-కోపైలట్ల సంభాషణలను రికార్డు చేయడానికి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) ను ఉపయోగిస్తారు. ఈ డీఎఫ్ డీఆర్(DFDR)నే బ్లాక్బాక్స్ గా వ్యవహరిస్తారని ఏఏఐబీ తెలిపింది

PolitEnt Media

PolitEnt Media

Next Story