సాంకేతికలోపాల కారణంగా ఎయిర్‌ ఇండియా విమానాలు ప్రయాణికులను భయకంపితులను చేస్తున్నాయి. వరుస సంఘటనలతో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణాలకు అనేక చోట్ల ఆటంకాలు ఏరపడుతున్నాయి. ఏ చిన్న సాంకేతిక సమస్య కనిపించినా విమానం టాకాఫ్‌ చెయ్యడానికి భయపడిపోతున్నారు ఎయిర్‌ ఇండియా విమానాల పైలట్లు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాద విషాదం మరువక ముందే ఎయిర్‌ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అహ్మదాబాద్‌ లో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం కూలిపోయి 274 మంది వరకూ మరణించగా మరుసటి రోజు శనివారం గువాహటి, కోల్‌కతా ఎయిర్‌ ఇండియా విమానానికి సాంకేతికలోపం తలెత్తడంతో అందులో ఉన్న 170 మంది ప్రయాణికులు భయాందోళనకు గుర్యారు. దీంతో ఆ విమాన సర్వీసు రద్దు చేసి 18 గంటల తరువాత వారందరినీ మరో విమానంలో గమ్యానికి చేర్చారు. ఆ తరువాత సోమవారం కూడా హాకాంగ్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా 787-8 బోయింగ్‌ విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. దీంతో టాకాఫ్‌ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్‌ విమానాన్ని యూటర్న్‌ తీసుకుని హాంకాంగ్‌ లో ల్యాండ్‌ చేశారు. తాజాగా మరో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు భయకంపితులయ్యారు. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయ్‌ వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానం మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తరువాత విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు. సిబ్బంది అలర్ట్‌ అయి ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story