TMC MP Abhishek Banerjee: పశ్చిమబెంగాల్‌లోని ప్రైమరీ స్కూల్ ఉద్యోగాల నియామక కుంభకోణం (టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్) కేసులో సంబంధిత మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ శుక్రవారం (జూన్ 15, 2026) హాజరయ్యారు.

ఈడీ అధికారులు అతన్ని సాల్ట్ లేక్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న తమ కార్యాలయంలో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో విచారించారు. సుమారు 8.5 గంటల పాటు విచారణ కొనసాగినట్లు సమాచారం. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇటీవల అభిషేక్‌కు సమన్స్ జారీ చేసింది. ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ఇతర నిందితుల వాంగ్మూలాలు, బ్యాంకు రికార్డులు, కమ్యూనికేషన్ డేటా ఆధారంగా అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదే సమయంలో, అసెంబ్లీలో విపక్ష నేత నియామకానికి సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో సీఐడీ ముందు ఒక రోజు ముందే అభిషేక్ హాజరయ్యారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభం ఎదుర్కొంటోంది. అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ వంటి నేతలపై జనాగ్రహం, దాడులు, పార్టీ ఎమ్మెల్యేలు-ఎంపీల తిరుగుబాటు వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story