ఢిల్లీ, హిమాచల్, పంజాబ్‌లో తీవ్ర వరదలు..

Yamuna River: ఉత్తర భారత రాష్ట్రాలను వర్షాలు వణుకుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు వరదల కారణంగా విస్తృత ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. పంజాబ్‌లో భారీ వర్షాలతో వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తుండగా, ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.

పంజాబ్‌లో దాదాపు 1,655 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. గురుదాస్‌పూర్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతినగా, 324 గ్రామాలు జలమయమైనాయి. ఫిరోజ్‌పూర్ (111), అమృత్సర్ (190), హోషియార్‌పూర్ (121), కపుర్తలా (123), సంగ్రూర్ (107) గ్రామాలు కూడా వరదల నుండి బయటపడలేకపోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. న్యూఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ వద్ద యమునా వరద నీరు మోకాల్లోతుగా ప్రవహిస్తోంది, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉత్తర భారత రాష్ట్రాలను వర్షాలు వణుకుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు వరదల కారణంగా విస్తృత ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. పంజాబ్‌లో భారీ వర్షాలతో వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తుండగా, ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.

పంజాబ్‌లో దాదాపు 1,655 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. గురుదాస్‌పూర్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతినగా, 324 గ్రామాలు జలమయమైనాయి. ఫిరోజ్‌పూర్ (111), అమృత్సర్ (190), హోషియార్‌పూర్ (121), కపుర్తలా (123), సంగ్రూర్ (107) గ్రామాలు కూడా వరదల నుండి బయటపడలేకపోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. న్యూఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ వద్ద యమునా వరద నీరు మోకాల్లోతుగా ప్రవహిస్తోంది, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 4) ఉదయం నీటి మట్టం 207.48 మీటర్లకు చేరుకున్నట్లు సమాచారం.

కాశ్మీర్ లోయలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలు రెండో రోజు కూడా మూసివేయబడ్డాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి సహా ఇతర రహదారులపై ట్రాఫిక్ ను నిషేధించారు. గురువారం పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా నాశనమైనాయి. ఇటీవలి వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

గురువారం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని వరద పరిస్థితులపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరద నీటిలో భారీగా దుంగలు ప్రవహిస్తున్నట్లు మీడియా దృశ్యాలు వైరల్‌కావడంతో కోర్టు స్పందించింది. హిమాలయ అడవులను అక్రమంగా నరికే విషయం గుర్తు చేస్తూ, దీనివల్ల పదే పదే సంభవించే ప్రకృతి వైపరీత్యాలు మరియు మరణాలకు దారితీస్తున్నాయని హైలైట్ చేసింది., గురువారం (సెప్టెంబర్ 4) ఉదయం నీటి మట్టం 207.48 మీటర్లకు చేరుకున్నట్లు సమాచారం.

కాశ్మీర్ లోయలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలు రెండో రోజు కూడా మూసివేయబడ్డాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి సహా ఇతర రహదారులపై ట్రాఫిక్ ను నిషేధించారు. గురువారం పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా నాశనమైనాయి. ఇటీవలి వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

గురువారం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని వరద పరిస్థితులపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరద నీటిలో భారీగా దుంగలు ప్రవహిస్తున్నట్లు మీడియా దృశ్యాలు వైరల్‌కావడంతో కోర్టు స్పందించింది. హిమాలయ అడవులను అక్రమంగా నరికే విషయం గుర్తు చేస్తూ, దీనివల్ల పదే పదే సంభవించే ప్రకృతి వైపరీత్యాలు మరియు మరణాలకు దారితీస్తున్నాయని హైలైట్ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story