ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "బైబిల్ మీద ప్రమాణం చేస్తూ చెబుతున్నా... ఫోన్ ట్యాపింగ్ పచ్చినిజం." అని ఆమె వెల్లడించారు. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్, సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు.



తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని స్పష్టం చేసిన షర్మిల, వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డి స్వయంగా ఆ ట్యాప్ చేసిన ఆడియోలు నాకు వినిపించారని అన్నారు. ఆమె విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.



జగన్, కేసీఆర్‌ల మధ్య ఆ రోజుల్లో ఉన్న సన్నిహిత సంబంధం రక్త బంధాన్ని మించిందని చెప్పాలన్న షర్మిల.. తనను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇద్దరూ కలిసి ఫోన్ ట్యాపింగ్‌ను ఒక స్కెచ్‌గా అమలు చేశారని ఆమె ఆరోపించారు.



ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు అధికారుల ముందుకు ఎక్కడికి వచ్చినా సాక్ష్యం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షర్మిల స్పష్టం చేశారు.


తనకు మద్దతు తెలిపిన వారిని బెదిరించారని, తనకు సపోర్ట్‌ చేసిన వాళ్లను రాజకీయంగా అడ్డుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.


Politent News Web4

Politent News Web4

Next Story