అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలలో ప్రభుత్వాలు, ప్రజలు పెద్దయెత్తున యోగా ప్రదర్శనలు చేశారు. సరిగ్గా 11సంవత్సరాల క్రితం 2014లో ప్రధాన నరేంద్రమోడీ ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి ప్రస్తావన చేసి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని ప్రతిపాదన చేశారు. మోడీ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో అప్పటి నుంచి ప్రపంచ దేశాలు అన్నీ జూన్ 21వ తేదీనాడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విధిగా అచరిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రతిపాదన చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు యోగా ఉత్సవాలను వేడుకగా నిర్వహించాయి. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు విశాఖ రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకూ 28 కిలోమీటర్లు బారున సముద్ర తీరం వెంబడి దాదాపు మూడు లక్షల మందితో యోగసనాలు ప్రదర్శించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొని యోగాసనాలు వేశారు. ఇదే తరహాలో వన్ ఎర్త్ వన్ హెల్త్ కాన్సెప్ట్ లో ప్రపంచం అంతా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ, విదేశాలలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు వేసిన యోగాసనాల చిత్రమాలిక పొలిటెంట్ న్యూస్ వీక్షకులు కోసం....































































Updated On 21 Jun 2025 12:58 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story