Actress Pragya Jaiswal latest photo shoot

కంచె సినిమాకు గద్దర్ సినిమా అవార్డు అందుకున్న ప్రగ్యా జైస్వాల్… చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. డాకు మహారాజ్ సినిమాతో పాపులరైన ప్రగ్యా జైస్వాల్…. ఇటీవల విదేశాల్లో విహారానికి వెళ్లిన ఫోటోలతో అభిమానులను కవ్విస్తోంది.


తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించిన ఈ చిన్నది తెలుగులో కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.


మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జనవరి 12 1988లో జన్మించింది. జైస్వాల్… పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లో న్యాయవిద్య అభ్యసించింది.


న్యాయవిద్య చదువుతున్న సమయంలోనే విశ్వవిద్యాలయంలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది.


తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో 2014లో వెండితెరకు పరిచయమైంది.


2014లోనే ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. దీంతో ఒకే ఏడాదిలో తమిళం, తెలుగుతో పాటు హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది.


2015లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమాలో నటించింది.


గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాలో చాన్స్ కోసం ఈ ముద్దుగుమ్మ ఆడిషన్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు.


కైపెక్కించే చూపులతో మాయ చేస్తున్న ప్రగ్యాజైస్వాల్… డాకు మహారాజ్ తో గ్లామర్ డోసు కూడా పెంచింది.


ప్రగ్యా జైస్వాల్ సినీ రంగంతోపాటు ఫ్యాషన్ ప్రపంచంలోను హొయలొలికిస్తోంది. డోవ్,డాబర్‌ వాటికా, మిలీనియమ్‌ హైపర్‌ మార్కెట్‌ ఫర్‌ దుబాయ్‌, రిలయన్స్‌ డిజిటల్‌, ఎఫ్‌బీబీ వంటి పాపులర్‌ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేసింది.


ఫిజికల్ ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ సొగసరి డాకుమహారాజ్ హిట్ కావటం తనకు టర్నింగ్ పాయింట్ అని మురిసిపోతోంది.



courtesy : instagram








Politent News Web3

Politent News Web3

Next Story