అతిపెద్ద సవాల్..

Jaiswal: 23 ఏండ్ల యశస్వి జైస్వాల్ డేరింగ్, డాషింగ్ ఆటతీరుతో టెస్ట్ క్రికెట్ లోకి దూసుకొచ్చాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఇండియా టాప్ స్కోరర్ గా నిలిచిన అతను ఇప్పుడు రోహిత్ గైర్హాజరీలో సీనియర్ ఓపెనర్ అతను టూరు వస్తున్నాడు. ఇండియాలో ఆడిన 10 మ్యాచ్ 60.61 సగటుతో రాణించినప్పటికీ ఈ టూర్ అతని కెరీర్లోనే అతిపెద్ద సవాల్ కానుంది. స్వింగ్ అయ్యేడ్యూక్ బాల్స్, ఇంగ్లండ్ సీమర్ల లాంగ్ స్పెల్స్ జైస్వాల్ టెక్నిక్కు, సహనానికి అసలైన పరీక్ష పెడతాయి. కష్ట సమయంలో సలహా ఇచ్చేందుకు క్రీజులో మరోవైపు కోహ్లి, రోహిత్ వంటి దిగ్గజాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్వింగ్ సవాలును జైస్వాల్ ఎలా అధిగమి స్తాడన్న దానిపైనే సిరీస్లో ఇండియా శుభారంభం ఆధారపడి ఉంది.

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 20 నుంచి ఫస్ట్ టెస్ట్ మొదలు కానుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. గత ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story