Squad for Australia Tour: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమ్‌ఇండియా స్క్వాడ్‌ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇవాళ ప్రకటించనుంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ వన్డే , టీ20 జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట మధ్యలో జరగవచ్చని భావిస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ , ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా (కండరాల గాయం), రిషభ్ పంత్ (కాలి గాయం) వంటి కీలక ఆటగాళ్లు ఇంకా కోలుకోకపోవడంతో వారి స్థానాల్లో వేరే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్‌లకు, శుభ్‌మన్ గిల్ కు విశ్రాంతినిస్తే, యశస్వి జైస్వాల్ లేదా అభిషేక్ శర్మ వంటి వారికి అవకాశాలు లభించవచ్చు.

ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడిన జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంపై సెలెక్టర్లు దృష్టి పెట్టవచ్చు, ఎందుకంటే ఆస్ట్రేలియా పర్యటన తరువాత టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికాతో కీలకమైన టెస్ట్ సిరీస్ ఉంది.సాయంత్రంలోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story