FIDE World Chess Championship: ఫిడే (FIDE) వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి చరిత్ర సృష్టించారు. దోహా (ఖతార్) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆయన అద్భుతమైన ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలను (Double Bronze) సాధించారు.

వరల్డ్ ర్యాపిడ్ విభాగంలో కాంస్యం

ఈ విభాగంలో అర్జున్ 13 రౌండ్లలో 9.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.లెజెండరీ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ విభాగంలో మెడల్ నెగ్గిన రెండో భారతీయ పురుష క్రీడాకారుడిగా అర్జున్ నిలిచారు.

వరల్డ్ బ్లిట్జ్ విభాగంలో కాంస్యం

బ్లిట్జ్ విభాగంలో అర్జున్ అసాధారణ ఫామ్‌ను కనబరిచారు. లీగ్ దశలో (Swiss Segment) 19 పాయింట్లకు గాను 15 పాయింట్లు సాధించి టేబుల్ టాప్‌లో నిలిచారు.అయితే సెమీఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోడిర్‌బెక్ అబ్దుసట్టోరోవ్ చేతిలో (0.5 - 2.5 స్కోరుతో) ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

ఒకే ఏడాది అటు ర్యాపిడ్, ఇటు బ్లిట్జ్ విభాగాల్లో మెడల్స్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా అర్జున్ రికార్డు సృష్టించారు.మహిళల విభాగంలో భారత స్టార్ ప్లేయర్ కోనేరు హంపి కూడా ర్యాపిడ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ ర్యాపిడ్, బ్లిట్జ్ (తన 9వ బ్లిట్జ్ టైటిల్) రెండింటిలోనూ గోల్డ్ మెడల్స్ సాధించి తన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

తెలంగాణకు చెందిన ఈ యువ ఆటగాడి విజయంపై ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Next Story