Army celebrations at IPL closing ceremony

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక నిర్వహిస్తారు. ఈ ముగింపు వేడుకల్లో ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా భారతీయ త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతారు.IPL 2025 లీగ్ స్టేజ్ పూర్తి కావొచ్చింది. మే 29 నుండి కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మే 29న పంజాబ్ లోని ముల్లంపూర్‌లో జరిగే క్వాలిఫైయర్ 1 విజేతగా నిలిచిన ఐపీఎల్ మొదటి ఫైనలిస్ట్ అవుతుంది. ఆ తర్వాత మే 30న ముల్లంపూర్‌లోనే ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. అది గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 ఆడటానికి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిన జట్టుతో, ఎలిమినేటర్ విజేత తలపడతాయి. జూన్ 1న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2 జరుగుతుంది. ఆ మ్యాచ్ గెలిచిన జట్టు రెండవ ఫైనలిస్ట్ అవుతుంది. టైటిల్ పోరు జూన్ 3న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుక నిర్వహిస్తారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని IPL ఫైనల్‌ వేడుకల్లో సెలబ్రేట్ చేస్తారు. అందుకోసం BCCI కొందరు ప్రత్యేక అతిథులను ఆహ్వానించిందిఐపీఎల్ 2025 ముగింపు వేడుకలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకోవడానికి ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ దళాల చీఫ్‌లను, రక్షణ సిబ్బందికి చెందిన ప్రముఖులను బీసీసీఐ ఆహ్వానించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. తరువాత, భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి, వారి పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుని ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసింది. అయినా పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో అమాయక పౌరులపై కాల్పులకు దిగింది. డ్రోన్ దాడులు సైతం చేసింది. అయితే భారత బలగాలు ఆ డ్రోన్లను ఛేదించడంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసి ధ్వంసం చేశాయి..భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా IPL 2025ని వారం రోజులు తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. మే 17వ తేదీన ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ చేశారు. విదేశాలకు వెళ్లిన చాలా మంది ఆటగాళ్ళు IPL ఆడటానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.

టైటిల్ పోటీలో ఈ నాలుగు జట్లు ఉన్నాయి

IPL సీజన్ 18 టైటిల్ కోసం ఇప్పుడు 4 జట్లు ప్లే ఆఫ్ చేరాయి. 6 జట్లు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌ ఆడనున్నాయి. లీగ్ లో చివరి మ్యాచ్ ఆర్సీబీ, లక్నోల మధ్య జరగనుంది. తర్వాత పంజాబ్‌తో క్వాలిఫైయర్ 1లో ఏ జట్టు ఆడాలి, ఏ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అనేది తేలనుంది.

Politent News Web3

Politent News Web3

Next Story