Asia Cup 2025: ఆసియా కప్ ను సీక్రెట్ ప్లేస్ కు తరలించిన నఖ్వి
సీక్రెట్ ప్లేస్ కు తరలించిన నఖ్వి

Asia Cup 2025: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్ తర్వాత జరిగిన ట్రోఫీ వివాదం కొనసాగుతోంది. భారత జట్టు ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి విజేతగా నిలిచినప్పటికీ, క్రాస్-బోర్డర్ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధిపతి , ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వి (Mohsin Naqvi) నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది.
మొహ్సిన్ నఖ్వి ఆదేశాల మేరకు ఆసియా కప్ ట్రోఫీని దుబాయ్లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రధాన కార్యాలయం నుంచి అబుదాబిలోని ఒక గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ట్రోఫీ ప్రస్తుతం నఖ్వి ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. భారత జట్టు ట్రోఫీని తిరస్కరించిన తర్వాత, నఖ్వి దానిని వేదికపై నుండి తీసివేసి, తన కస్టడీలోకి తీసుకున్నారు.
ట్రోఫీని భారత్కు అప్పగించడానికి, ఒక భారతీయ ఆటగాడు లేదా BCCI అధికారి వచ్చి తన నుంచి ట్రోఫీని తీసుకోవడానికి ఒక వేడుకకు హాజరు కావాలని నఖ్వి పట్టుబడుతున్నారు. BCCI దీనిని వ్యతిరేకిస్తోంది. ట్రోఫీని అధికారికంగా అప్పగించాలని ACCకి లేఖ రాసింది.

