ఎట్టకేలకు మౌనం వీడిప ద్రవిడ్

Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచి 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. అయితే ఆ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగి 11మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు మౌనం వీడారు.ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

‘‘బెంగళూరు ప్రజలకు క్రీడలంటే బాగా ఇష్టం. నేను కూడా బెంగళూరుకు చెందినవాడినే. ప్రజలు క్రికెట్‌ను మాత్రమే కాదు.. అన్ని క్రీడలను ఇష్టపడతారు. అది ఫుట్‌బాల్ అయినా, కబడ్డీ అయినా, ప్రజలు అన్ని జట్లను ఫాలో అవుతారు. ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. విజయోత్సవాల వేళ తొక్కిసలాట జరగడం దురదృష్టకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం’’ అని ద్రవిడ్ అన్నారు.

కాగా తొక్కసలాట ఘటనపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అరెస్ట్ అయ్యాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎ. శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం రూ.25 లక్షలు, ఆర్సీబీ 25లక్షల పరిహారం అందజేయనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story