శ్రీ చరణికి చంద్రబాబు బంపర్ ఆఫర్

Telugu Cricketer Sri Charani: తెలుగు క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టులో కడప జిల్లాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీ చరణి, మిథాలీ రాజ్, క్రికెట్ జట్టు క్రీడాకారులు సంతకం చేసిన టీ-షర్టును ముఖ్యమంత్రికి బహూకరించారు.

శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 2.5 కోట్లు నగదు, గ్రూప్-1 అధికారి స్థాయి ఉద్యోగం, కడపలో 1,000 చదరపు గజాల (Sq. Yard) ఇంటి స్థలం కేటాయించారు. శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని, ఆమె విజయం రాష్ట్ర యువతకు స్ఫూర్తినిస్తుందని చంద్రబాబుఈ సందర్భంగా కొనియాడారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story